ఈ షోకి ఇప్పుడు ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్, హీరోయిన్ ఇంద్రజ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఐతే వీళ్లకు పారితోషకం మాత్రం చాలావరకు తగ్గించారని తెలుస్తోంది. నాగబాబు, రోజా కు ఒక్కో ఎపిసోడ్ కు ఐదు లక్షలు పారితోషకం అందేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కృష్ణ భగవాన్, ఇంద్రజ లకు మాత్రం పారితోషకం బాగా తగ్గించేసారట. ప్రస్తుతం వీళ్లకు ఒక ఎపిసోడ్ కు రెండున్నర లక్షలు ఇస్తున్నారని సమాచారం. నాగబాబు, రోజా లతో పోలిస్తే వేళ్ళకు ఇస్తున్నది సగం. పారితోషకాలలో ఇంతగా మార్పులు రావటానికి కారణాలు ఏమిటో అంతుచిక్కడంలేదు ఎవరికి. ఒకప్పుడు జబర్దస్త్ లో ప్రేక్షకులను అలరించిన వేణు, ధన్రాజ్, వంటి కమెడియన్స్ షోను విడిచి వెళ్ళటం వలన జబర్దస్త్ పాపులారిటీ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇది కూడా ఒక కారణం కావొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.
ఒకప్పుడు టాప్ కమెడియన్ గా వెలిగిన కృష్ణ భగవాన్ కు ఇప్పుడు సినిమా అవకాశాలు కాస్త సన్నగానే ఉన్నాయ్. ఇంద్రజాది కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు టాప్ హీరోస్ తో నటించిన ఈమె ప్రస్తుతం సినిమాలలో చిన్న చిన్న పత్రాలు చేస్తుంది. తాజాగా ఈమె ఉగ్రం, మాచర్ల నియోజకవర్గం, స్టాండ్ అప్ రాహుల్ వంటి చిత్రాలలో నటించారు. సినిమాలలో నటిస్తూనే బుల్లితెర కి కూడా ప్రాధాన్యం ఇస్తోంది ఈ హీరోయిన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి