టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి కి ఎంత టి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆమె సినిమాల సినిమాల విషయంలో ఎంత పక్కా ప్లానింగ్ తో ఉంటుందో అందరికీ తెలిసి ఉంటుంది. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత ఆమెకి అభిమానుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ఒక టాగ్ లైన్ ని కూడా ఏర్పరచుకుంది సాయి పల్లవి. ఇక అలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది సాయి పల్లవి .

ఈ నేపథ్యంలోనే ఈటీవీలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఆమె .ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని సంచలన వ్యాఖ్యలను చెప్పకు వచ్చింది. అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా సాయిపల్లవి మాట్లాడుతూ తనకు సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ నీ బయటపెట్టింది. ఇక సాయి పల్లవికి ప్రతిరోజు విభూతిని తినే అలవాటు ఉంది అంటూ ఇంటర్వ్యూలో భాగంగా బయటపెట్టింది.  మనందరికీ తెలిసిందే సాయి పల్లవి సాయి బాబా భక్తురాలు అని.. అంతేకాదు  చాలా నిష్టగా పూజలు చేస్తూ ఉంటుంది సాయి పల్లవి. అయితే ఈ నేపథ్యంలోనే సాయిబాబా భక్తులు అందరూ

కూడా విభూదిని తింటూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి తినడం మనందరికీ తెలిసిందే. కానీ సాయి పల్లవి మాత్రం రోజు పొద్దున్న సాయంత్రం 365 రోజులు అవిభూతిని తింటూనే ఉంటుందట. ఇక అది తింటే ఆమెకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందని ఆమె గట్టి  నమ్మకం. ఆ విషయాన్ని స్వయంగా సాయిపల్లవిని ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొంది. దీంతో సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో సాయి పల్లవి కి విభూది తినే అలవాటు ఉందా అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది చాలా ఫన్నీ గా రకరకాల కామెంట్స్ ని చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: