సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో, బాలీవుడ్ స్టార్ రణ్‍ బీర్ కపూర్ హీ రోగా నటించిన చిత్రం 'యానిమల్'. గల ఏడాది డిసెంబర్ 1న థియేటర్ల లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్‍ బాస్టర్ హిట్ అందుకుంది.ప్రపంచ వ్యాప్తం గా సుమారు రూ.840 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ ఎంతటి విజయం సాధిం చిందో అంతకంత నెగిటివిటిని కూడా ఎదు రుకుంది. పల్లు సినీ ప్రముఖులు ఈ మూవీ పై, సందీప్ రెడ్డి వంగా పై విమ ర్శలు చేయడం స్టార్ట్ చేశారు. 'యానిమల్‌' లో బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ, ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపి స్తోందని కామెంట్స్ చేశారు. అయిన ప్పటికి సందీప్ కొంచెం కూడా భయ పడకుండా ప్రతి ఒకరికి తన స్టైల్ లో సమాధానం ఇస్తూ వస్తున్నారు.
తాజాగా మీ సినిమాలో హీరోయిన్స్‌ని అంత నీచంగా చూపిం చాల్సిన అవసరం ఏముందని కొంత మంది నెటి జన్లు సందీప్ ని ప్రశ్నించారు. అయితే సందీప్ రెడ్డి ఈ విషయాలపై తనదైన స్టైల్‌లో సమాదానం ఇచ్చారు.. ' పూర్తిగా ఫీల్ అవ్వాలంటే వారితో కేవలం సంభోగం చేస్తే సరిపోదు. వారిని అన్ని విధాలుగా ఫీల్ అవ్వాలి. కొంతమంది స్త్రీలు కొట్ట కపోతే కొన్ని విషయాలు అర్థం చేసుకోలేరు. అలాగే మీరు ఆడ వారిని అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే వారిని అన్ని విధా లుగా టచ్ చేయాల్సి కూడా ఉంటుంది' అంటూ చాలా బోల్డ్ కామెంట్స్ చేశాడు. ఒక్క సారిగా సందీప్ మాటలు సోషల్ మీడియా లో దుమారం రేపాయి. దీంతో 'సందీప్ రెడ్డి కి పిచ్చి బాబోయ్' అంటూ 'తన భార్యను కూడా ఇలాగే కొడ తాడా' అని కామెంట్స్ పెడు తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: