టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి వైవా హర్ష తాజాగా సుందరం మాస్టర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇందులో దివ్య శ్రీపాద , హర్షవర్దన్ , బాలకృష్ణ నీలకంఠపు , భద్రం ఈ మూవీ లో కీలక పాత్రలు పోషించారు. ఆర్టీ టీమ్ వర్క్స్ , గోల్డెన్ మీడియా బ్యానర్స్ పై రవితేజ , సుధీర్ కుమార్ ఈ మూవీ ని నిర్మించారు. 

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరోత్సాహ పరిచిన ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ వారు ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ ఆయన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: