బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో తన అభినయంతో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా చక్రం తిప్పింది అన్న విషయం తెలిసిందే. ఇక అక్కడి స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. అయితే కేవలం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొని సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అటు వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా మూవీలో ఇక వెంకీ మామతో జతకట్టి ఆకట్టుకుంది.


 ఇక ఈ సినిమాలో తన నటనతో ప్రశంసలు కూడా అందుకుంది ప్రీతిజింటా. ఇక ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అంతకుముందే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రాజకుమారుడు మూవీలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈ రెండు సినిమాలు తప్ప ఆ తర్వాత టాలీవుడ్ లో ఏ సినిమా చేయలేదు. కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైంది. ఇక ఈ మధ్యకాలంలో మాత్రం ఐపీఎల్లో అటు పంజాబ్ కింగ్స్ ఓనర్గా కొనసాగుతున్న ప్రీతి జింటా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.


 ఇటీవల సోషల్ మీడియాలో అస్క్ మీ ఎనీ థింగ్ అనే పేరుతో అభిమానులందరితో ముచ్చటించింది ఈ హీరోయిన్. తెలుగు సినిమాల్లో ఎప్పుడూ నటిస్తారు అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా.. దానిపై ప్రీతిజింతా ఇలా స్పందించారు. ఎప్పుడు కాదని చెప్పకూడదు. ఒకవేళ మంచి కథ దొరికితే కచ్చితంగా మళ్ళీ తెలుగు సినిమాల్లో నటిస్తానేమో ఎవరికి తెలుసు అంటూ ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. కాగా ఈ ఐపిఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు చెత్త ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో డగౌట్ లో కూర్చున్న ప్రీతిజింటా తెగ బాధపడిపోతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: