సౌత్ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా రజనీకాంత్ మరొక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.. అదేమిటంటే.. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చేటువంటి గోల్డెన్ వీసాను రజనీకాంత్ అందుకోవడం జరిగింది. నిన్నటి రోజున అబుదాబిలోని DTC లో రజనీకాంత్ గోల్డెన్ వీసా అని అందుకున్నారు.అలాగే మలయాళ వ్యాపారవేత్త MA యూసఫ్ అలీ సమక్షంలో  అలాగే డిటిసి చైర్మన్ మహమ్మద్ ఖలీఫా ఆల్ ముబారక్ రజనీకాంత్ కు అందజేశారు.


వివిధ రంగాలలో పేరు పొందిన వారికి ఇలా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందిస్తోంది. 2019 యూఏఈ ప్రభుత్వం ఈ వీసాల కోసం ప్రత్యేకమైన వ్యవస్థను కూడా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.. అయితే ఈ వీసా కాలపరిమితి దాదాపుగా పదేళ్లపాటు ఉంటుందట.. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ఈ గోల్డెన్ వీసా అని కూడా అందుకోవడం జరిగింది.. ఈ అరుదైన వీసా పొందిన అనంతరం రజనీకాంత్ చాలా ఆనందాన్ని తెలియజేశారు.


యూఏఈ ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం చాలా ఆనందంగా ఉంది అంటూ వీసా విధా విధానాలను నిర్వహించినందుకు గ్రూప్ అధినేతలకు యూసఫ్ ఆలీకి కృతజ్ఞతలు సైతం వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా అబూదాలో ఉండే ఒక గ్రాండ్ మసీదును సైతం రజనీకాంత్ సందర్శించినట్లు తెలుస్తోంది అంతేకాకుండా దేశంలో అతిపెద్ద బాక్స్ హిందూ దేవాలయాన్ని కూడా సందర్శించినట్లు సమాచారం. అలాగే డి టి సి చైర్మన్ యూసఫ్ అలీ నివాసంలో కూడా భోజనం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజనీకాంత్ ఈ వెకేషన్ అయిపోయిన వెంటనే తిరిగి సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం రజనీకాంత్ పైన మరొకసారి ప్రశంశాలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: