గత కొంతకాలంగా టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న ఘాటి సినిమా కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈనెల 18వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా కానీ రిలీజ్ కాలేదు. దీంతో ఘాటి సినిమా వెనుక ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించే సమయంలో చాలా సింపుల్ గానే ప్రారంభించారు. ఆ తర్వాత ఎక్కడ హడావిడి లేకపోయినా..అప్డేట్లతో గ్లింప్స్ తో బాగానే ఆకట్టుకున్న ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్డేట్ అయితే విడుదల చేయలేదు.


ఇక అభిమానులు టీజర్, ట్రైలర్ కోసం చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. ఇందులో అనుష్క విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా ఎంతో  వైలెన్స్ గా  ఉంటుందో ఈ సినిమా అప్డేట్ల విషయం పైన అంతే సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. అసలు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నట్లుగా కూడా చిత్ర బృందం ఇంకా ఎక్కడా కూడా ప్రకటించలేదు.


ప్రస్తుతమైతే అనుష్క ఘాటి సినిమా ల్యాబ్ లోనే ఉన్నదని ఒడిస్సా సరిహద్దులలో షూటింగ్ జరుగుతోందని అక్కడ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగానే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ క్రిష్ అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఏర్పడుతున్నప్పటికీ కొన్ని కారణాల చేత రిలీజ్ కి మాత్రం ఈ సినిమా నోచుకోవడం లేదనే విధంగా అనుష్క అభిమానులు తెలియజేస్తున్నారు. మరి మొత్తానికి అనుష్క, డైరెక్టర్ క్రిష్ పరిస్థితి ఒకేలాగా కనిపిస్తూ ఉన్నది.. ఘాటి సినిమా విడుదల మీదే వీరికి ఆధారపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: