పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు. ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాపై నెటిజన్స్ కి భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందించనున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. స్పిరిట్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వార్త నిజమైతే మాత్రం పండగే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.  

ఇకపోతే ఈ సినిమాకు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పిరిట్ సినిమా కోసం గట్టిగా పని చేస్తున్నారని అన్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు అదిరిపోయే సంగీతం అందిస్తానని స్పష్టం చేశారు. సందీప్ రెడ్డి వంగాతో ఇంకా మ్యూజిక్ గురించి చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. సందీప్ రెడ్డితో చేసిన ప్రతి సినిమాలో విజిల్ సౌండ్ కలిసి వస్తుందని అన్నారు. అందుకని స్పిరిట్ సినిమాకు కూడా విజిల్ సౌండ్ సెంట్ మెంట్ ని పాటిస్తానని హర్షవర్ధన్ రామేశ్వరన్ చెప్పుకొచ్చాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే చాలు ప్రాణాలు ఇచ్చే అంతా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ప్రభాస్ ని టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ డార్లింగ్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఇండియా లోనే కాదు.. ఇతర దేశాలలో కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఏ సినిమా చేసినా పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. ఇక సోషల్ మీడియాలో విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ ఆయన గురించి అలా ట్రెండ్ అవుతూనే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: