
ఈ జాబితాలో మొదట నిత్యా మీనన్ గురించి చెప్పుకోవాలి. నాని హీరోగా తెరకెక్కిన `అలా మొదలైంది` సినిమాతో నిత్యా మీనన్ టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది.
2015లో నాని హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన `ఎవడే సుబ్రహ్మణ్యం` సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో అందాల భామ మాళవిక నాయర్ కథానాయికగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
2016లో `కృష్ణగాడి వీరప్రేమ గాథ` సినిమాతో నాని మరొక హీరోయిన్ ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆమె ఎవరో కాదు మెహ్రీన్ కౌర్. అదే ఏడాది నాని నటించిన `జెంటిల్మెన్` మూవీ విడుదలైంది. ఈ సినిమాతో మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది.
2016లోనే నాని `మజ్ను` అంటూ మరో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్లో వచ్చాడు. ఇందులో అనూ ఇమాన్యుల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ వయ్యారికి తెలుగులో మజ్నునే డెబ్యూ కావడం విశేషం. అలా ఒక్క ఏడాదే ముగ్గురు హీరోయిన్లను టాలీవుడ్ కు పరిచయం చేశాడు నాని.
2019లో రిలీజ్ అయిన నాని `గ్యాంగ్ లీడర్` సినిమాతో ప్రియాంకా అరుళ్ మోహన్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అదే క్రికెట్ బ్యాక్డ్రాప్లో నాని నటించిన `జెర్సీ` మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ టాలీవుడ్లోకి వచ్చింది.
మలయాళ స్టార్ బ్యూటీ నజ్రియా నజీమ్ కూడా నాని నటించిన `అంటే సుందరానికి` సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇక నిర్మాతగా `కోర్టు` మూవీతో శ్రీదేవి అపల్లాని హీరోయిన్ గా పరిచయం చేశారు నాని.