
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ యమదొంగలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించబోతున్నాడు. అవును, మీరు విన్నది నిజమే.. మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం `ఖలేజా`. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2010లో విడుదల అయింది. అప్పట్లో కమర్షియల్ గా ఈ సినిమా డిజాస్టర్ అయిన కూడా.. ఆ తర్వాత ఖలేజా కు కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ముఖ్యంగా టెలివిజన్ లో ఖలేజా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఖలేజా వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు.
అంతలా ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది, ఈ నేపథ్యంలోనే ఖలేజాను థియేటర్స్ లో మళ్లీ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. మే 30న తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో ఈ సినిమా రీరిలీజ్ కాబోతోంది. అందులో భాగంగానే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా ఓ క్రేజీ న్యూస్ ను రివీల్ చేశారు. ఖలేజాకు సంబంధించి 50 సెకన్ల ఓ మాషప్ వీడియోను ఎన్టీఆర్ నటించిన యమదొంగ రీ-రిలీజ్ కు అటాచ్ చేసి ప్రదర్శిస్తున్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఓవర్సీస్ లోని థియేటర్స్ లో మాత్రమే ఈ మాషప్ స్క్రీనింగ్ కాబోతోందని సమాచారం.