హీరోయిన్ ఎస్తేర్ నోర్నోహా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు.  బాగా తెలిసిన వ్యక్తి . మరీ ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది అంటూ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ట్యాగ్ వేయించుకొని ట్రెండ్ అవుతూ ఉంటుంది . 1000 అబద్ధాలు అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఎస్తేర్ నోర్నోహా ఏ ఇంటర్వ్యూ కి అటెండ్ అయినా సరే చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తుంది . ఉన్నది ఉన్నట్లే మాట్లాడేస్తుంది . 1000 అబద్దాలు సినిమా తర్వాత భీమవరం బుల్లోడు మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎస్తేర్ ..ఆ తర్వాత తన పరసనల్ విషయంలో మాత్రం కొంచెం టఫ్ సిచువేషన్ ఫేస్ చేసింది.  కాగా ఎన్ని సినిమాలలో నటిస్తున్న హీరోయిన్గా తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోలేకపోతున్న ఎస్తేర్ నోరోణా.. సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది .


ఆ తర్వాత వీళ్ల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు . ఈ విషయంపై ఇద్దరూ ఏ విధంగా మాట్లాడడానికి ఇద్ద్రౌ ఇష్టపడరు . ప్రజెంట్ తనదైన స్టైల్ లో చేతికి వచ్చిన పాత్రలలో నటిస్తూ అలరిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నింది.  ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ "వేశ్యలకు  సంబంధించిన ప్రాబ్లమ్స్ ను బయట పెట్టింది ". ఆమె మాట్లాడుతూ .."సమాజంలో వేశ్యలను  చాలా చులకనగా చూస్తూ ఉంటారు . వేశ్య వృత్తిలోకి ఎవరు చూసి చూసి రావాలి అనుకోరు ..కావాలి అని అస్సలు రారు .. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు కారణంగానే అలా వారిని మార్చేస్తూ ఉంటాయి".



"మగవాళ్ళు వేశ్యల దగ్గరకు వెళ్లి కోరికలు తీర్చుకోకుండా కేవలం డబ్బులు ఇచ్చేసి రండి.. అలా ఎవ్వరు చేయరు. వేశ్యలు సమాజంలో ఉన్నారు అంటే వారిని వాడుకునే వారు కూడా ఉన్నారని అర్థం . అది గుర్తుపెట్టుకోవాలి . మగాళ్లు వాళ్ళ దగ్గరకు వెళ్ళకపోతే వేశ్యలు ఉండరు కదా . ఈ వ్యవస్థను ప్రోత్సహించేది కూడా మగాళ్ళే " అంటూ కూసింత ఘాటుగా పచ్చగా నిక్కసిగా నిజాన్ని బయటపెట్టింది . ఈమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఎస్తేర్ నోర్నోహా మాటలపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: