
దాదాపు 5 కోట్లు ఖర్చు చేసి, ముంబైలోని ఒక బిజీ ఏరియాలో అపార్ట్మెంట్ కొన్నట్లు తెలుస్తోంది. ఇది ఆమె కేవలం తన ప్రైవేట్ పార్టీల కోసం, వ్యక్తిగతంగా ఉండడానికి మాత్రమే కొనుగోలు చేసిందని అంటున్నారు. శ్రీదేవి ఇప్పటికే కోట్లాది ఆస్తిని సంపాదించి పెట్టారు. బోనీ కపూర్ కూడా సంపన్నుడే. అయినా, జాన్వి కపూర్ తన స్వంత డబ్బుతో, తన ఇష్టానుసారం ఒక ఇల్లు కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటోందట. ఆ కారణంగానే ఆమె తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఈ విధంగా పెట్టుబడి పెట్టి, ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో, అభిమానుల “జాన్వి కపూర్ టూ ఫాస్ట్” అంటూ పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పెళ్లి తర్వాతే చాలామంది ఇల్లు కొనాలని ఆలోచిస్తారు. కానీ జాన్వి కపూర్ పెళ్లికి ముందే ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పడం విశేషంగా మారింది. గతంలో శ్రీదేవి కూడా పెళ్లికి ముందే సొంత ఆస్తులు కూడబెట్టుకున్న సంగతి గుర్తుచేసుకుంటూ, అభిమానులు సోషల్ మీడియాలో జాన్వి నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి జాన్వీ ఏదో బిగ్ ప్లాన్ లో ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు.