తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా పేరు సంపాదించిన వీకే.నరేష్ నిరంతరం ఏదో ఒక విషయంలో ఈ నటుడి పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈమధ్య పలు చిత్రాలలో తండ్రి క్యారెక్టర్లలో నటిస్తూ బాగానే పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా నరేష్ చేసే కామెంట్లు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన కె. ర్యాంప్ సినిమా థియేటర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా చిత్ర బృందంతో పాటుగా వీకే.నరేష్ కూడా హాజరయ్యారు.


సక్సెస్ మీట్ లో సీనియర్ హీరో నరేష్ మాట్లాడుతూ తన రెండు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉన్నానని ఇప్పటివరకు 200 కు పైగా నిర్మాతలను తాను చూశానని, కానీ చాలామంది నిర్మాతలు ఆర్టిస్టులకు కేవలం డబ్బులు ఇస్తే సరిపోతుందనుకుంటారు.  ఎంత కష్టపడి పని చేశామనే విషయం వారికి తెలియదు. కేవలం డబ్బులు ఇస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ కాస్తంత మర్యాద కూడా ఇవ్వాలి అంటూ తెలియజేశారు. ఈ విషయంలో మిగతా నిర్మాతల కంటే రాజేష్ చాలా బెటర్ అంటూ తెలియజేశారు. ఆయన ఆర్టిస్టులకు చాలా గౌరవిస్తారని వెల్లడించారు.


అందుకే నిర్మాత రాజేష్ అంటే తనకు చాలా ఇష్టమని కిరణ్ అబ్బవరం సినిమా హిట్ కావడం తనకి చాలా ఆనందంగా ఉందంటూ తెలిపారు. ఈ యంగ్ టీమ్  ఎంత కష్టపడ్డారో నాకే తెలుసు, ఆ కష్టానికి నిదర్శనమే  ఈ   విజయం  అంటూ తెలియజేశారు వీకే నరేష్. ప్రస్తుతం వీకే నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గడచిన కొంతకాలం క్రితం ప్రముఖ నటి పవిత్ర లోకేష్ విషయం పైన కూడా వార్తలలో నిలిచిన నరేష్ ఇప్పుడు తాజాగా మరొకసారి వార్తలలో నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: