టాలీవుడ్‌లో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు మాస్ మహారాజా రవితేజ. తన ఎనర్జీ, టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూ వస్తున్న రవితేజ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 75వ చిత్రాన్ని పూర్తిచేశాడు. రవితేజ 75వ సినిమా అంటేనే అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ఇదివరకు ఆయన చేసిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నా, ఈ ప్రాజెక్ట్ మాత్రం ప్రత్యేకమైందిగా చెప్పాలి. ‘మాస్‌ జాతర’ అనే టైటిల్‌కే మాస్ ఫీల్ కొట్టేస్తోంది. ఈ సినిమాపై అభిమానులు, ట్రేడ్ వర్గాలు, సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రవితేజ కెరీర్‌లో మరో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే నమ్మకం అందరిలో కనిపిస్తోంది. ఆయన గతంలో నటించిన సినిమా భారీ వసూళ్లు సాధించి 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా విజయంతో రవితేజ మళ్లీ తన ఫామ్‌లోకి వచ్చినట్టే.


ఇప్పుడు ఆయన చేస్తున్న ‘మాస్ జాతర’ మాత్రం అంతకంటే మరింత భారీ స్థాయిలో రూపొందింది. సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్, టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు యూత్‌లో బాగా పాపులర్ అయ్యాయి. ప్రత్యేకంగా రవితేజ స్టైలిష్ లుక్స్, ఆయన ఎనర్జీ లెవెల్స్‌ చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్స్‌లో ఓ ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు.ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి వచ్చిన అప్‌డేట్ మాత్రం అభిమానులలో మరింత ఉత్సాహం నింపింది. సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, అక్టోబర్ 28న సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ ప్రీ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం దృష్టి పడింది.



ఇక ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారనే అంశంపై కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది టాలీవుడ్ స్టార్ వస్తారని ఊహించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా తమిళ నటుడు, కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అవును..! మీరు విన్నది నిజమే. అమ్మాయిలకు, యువతకు ఫేవరెట్ హీరోగా పేరుగాంచిన సూర్య, ఈ వేడుకలో పాల్గొని రవితేజకు మద్దతు తెలపబోతున్నాడు. రవితేజ - సూర్యల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉందన్న విషయం చాలామందికి తెలిసిందే. ఆ స్నేహం నిమిత్తమే సూర్య ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. సూర్య ఎంట్రీతో ఈ ఈవెంట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఆయన లైవ్ స్టేజ్‌పై కనిపిస్తే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతారని చెప్పాల్సిన అవసరమే లేదు. రవితేజ అభిమానులు, సూర్య అభిమానులు ఇద్దరూ ఒకే వేదికపై తమ హీరోలను చూసే అదృష్టాన్ని పొందబోతున్నారు.చిత్ర బృందం చెబుతున్న ప్రకారం, ఈ ఈవెంట్‌ను గ్రాండ్ స్థాయిలో ప్లాన్ చేశారు. భారీ సెట్స్, స్పెషల్ లైటింగ్, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, మరియు మాస్ పాటలతో స్టేజ్ ఒక మినీ ఫెస్టివల్‌లా ముస్తాబవుతుంది. ఇప్పటికే ఈవెంట్‌కు సంబంధించిన పాస్‌లు, ఇన్విటేషన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  నవంబర్ 1న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా, రవితేజ కెరీర్‌లో మరో గోల్డెన్ పేజీని రాయబోతుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: