బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఇటీవల ఒక టాక్ షోలో మాట్లాడుతూ పెళ్లి గురించి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. పెళ్లి, దంపతుల సంబంధాల గురించి చర్చిస్తూ, ఆమె ఒక సీరియస్‌ కాన్సెప్ట్‌ను జోక్ గా, సరదా కోణంలో ప్రస్తావించారు. కాజోల్ మాట్లాడుతూ.. “పెళ్లికి కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి. ఇద్దరూ సంతోషంగా లేని పరిస్థితిలో, రీన్యువల్ ఆప్షన్ ఉండటం తప్పేమీ కాదు. నచ్చని వారితో బలవంతంగా జీవించడం ఎందుకు?”. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికలపై పెద్ద చర్చకు దారితీసాయి. కొంతమంది నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇది బూతు మాటలుగా వారు భావిస్తున్నారు. ఆమెపై తీవ్రంగా ట్రోలింగ్ ప్రారంభించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కాజోల్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కొంతమంది ప్రజలు, “సెలబ్రిటీలు ఏదైనా మాట్లాడే ముందు నోరు అదుపులో ఉంచుకోవాలి” అని హెచ్చరించారు, మరోవైపు కొన్ని సమూహాలు ఆమె వ్యాఖ్యలను స్మార్ట్ మరియు ప్రామాణిక తీరుగా చూసారు.


ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కాజోల్ తక్షణమే స్పందించారు. ఆమె తన మాటల పట్ల క్లారిటీ ఇస్తూ..“నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. షోలో సరదాగా జరిగిన చర్చను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా సంభాషణలు హ్యూమర్ కోణంలోనే ఉంటాయి. ప్రతి మాటను నిజ జీవిత సలహాగా భావించకండి. నా ఉద్దేశ్యం సరదాగా చర్చలను కొనసాగించడం మాత్రమే అని, మరియు వ్యక్తిగత జీవన విధానాలపై నేరుగా సూచనలేమీ ఇవ్వలేదని స్పష్టత ఇచ్చారు". కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.  దీని పై అందరు ఆమెని నెగిటివ్ గా చూస్తున్నారు. నీ వౌవాహిక జీవితాని చూసుకో ముందు అంటూ ఘాటు గా కౌంటర్స్ వేస్తున్నారు.



మొత్తం పరిస్థితిని విశ్లేషిస్తే, బాలీవుడ్ సెలబ్రిటీల సాంఘిక మీడియా ప్రెజెన్స్ ఎంత ప్రభావవంతమైనదో, మరియు ఒక్కో వ్యాఖ్య సామాజిక చర్చలకు ఎలా విపరీత ప్రతిచ్ఛాయలను కలిగించగలదో ఈ ఉదాహరణ స్పష్టంగా చూపిస్తోంది. కాజోల్ తన హాస్యమయ, సరదా శైలిలో చేసిన వ్యాఖ్యలు, కచ్చితంగా హ్యుమర్ కోణంలోనే ఉండాలని ఆమె స్పష్టం చేయడం ద్వారా, ఈ వివాదాన్ని సానుకూలంగా ముగించగలిగింది అని అంటున్నారు సినీ ప్రముఖులు.  గతంలో రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు ఉన్నాయి అని కూడా చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఈ కాజోల్..!

మరింత సమాచారం తెలుసుకోండి: