సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ' సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీ ఫీల్ సిటీ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ఇంట్రో సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని తాజాగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈసాంగ్ కోసం ముంబై బ్యూటీ పూజా హెగ్డే పేరు కూడా వినబడుతుంది. మేకర్స్ తమన్నా కు బదులు పూజా హెగ్డే ను తీసుకోవాలనుకుంటున్నారట. వీరిద్దరిలో ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. మరి వీరిలో ఈ ఇంట్రో సాంగ్ అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్ లో పూర్తి కానుంది. కాగా ఈ చిత్రం లో సీనియర్ హీరోయిన్ విజయశాంతి లెక్చరర్ పాత్రలో నటిస్తుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ . ఎంబి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది. ఇక భరత్ అనే నేను , మహర్షి సినిమాలతో వరుసగా హిట్లు కొట్టి మహేష్ ఫుల్ ఫామ్ లో ఉండగా ఇటీవలఎఫ్2 తో కెరీర్ లో మొదటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు అనిల్ రావిపూడి.. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సరిలేరు నీకెవ్వరు ఫై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈచిత్రం ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.