బ్రిడ్జి నిర్మాణంతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్కు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జూబ్లీహిల్స్ నుంచి మైండ్స్పేస్, గచ్చిబౌలికి దాదాపు రెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. పంజాగుట్ట నుంచి నానక్రాంగూడాలోని బాహ్యావలయ రహదారికి అతి సులభంగా చేరుకోవచ్చు. ఈ నిర్మాణానికి మరో ప్రత్యేకత ఆకర్షణ ఎల్ఈడీ లైట్లు నిలవనున్నాయి. మొత్తం 40 వేల లైట్లను దీనిపై అమర్చారు. అలాగే రవాణా సౌకర్యంగానే కాకుండా దుర్గంచెరువు పరిసరాలను పర్యాటకంగాను ముస్తాబు చేస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైకి వాహనాలకు అనుమతించరు. వారాంతాల్లో కేవలం పర్యాటకులను మాత్రమే కాలినడకన కేబుల్ బ్రిడ్జిపైకి అనుమతించనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది.
వాహనాలను నిర్దేశించిన స్థలంలో పార్క్ చేసుకొని, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైకి కాలినడకన మాత్రమే వెళ్లాలని సూచించారు. మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా తీర్చి దిద్దే పనిలో పడింది.దానికితోడు ఐటి శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుంచి ఆయన ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకే ఇటువంటి మరమ్మతులు పనైనా,భాగ్యనగరానికి మరింత అందం పెంచే దిశగా ప్రతి పనిని యుద్ధ ప్రాతిపదికన చేయించారు.