ఈ మధ్యకాలంలో  వెలుగులోకి వస్తున్న కొన్ని రకాల ఘటనలు సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయి. క్షణకాల సుఖం కోసం సత్ప్రవర్తనతో మెలగాల్సిన మనుషులు వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వావివరసలు లేకుండా వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మనుషులము అన్న విషయాన్ని కూడా మర్చిపోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆమె ఒక టీచర్ ఇక తన వద్దకు చదువు కోసం వచ్చిన పిల్లల విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి.  తన దగ్గరకు వచ్చిన విద్యార్థులందరినీ కూడా మంచి మాటలు చెబుతూ సన్మార్గంలో నడిపించాలి.



 కానీ ఇక్కడ ఉన్న టీచర్ మాత్రం బ్రతుకు పాఠాలు కాదు ప్రేమ పాఠాలు నేర్పుతూ ఏకంగా మైనర్ బాలుడు ని తన బుట్టలో వేసుకుంది..  అంతటితో ఆగకుండా ఏకంగా ఆ మైనర్ బాలుడితో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా జంప్ అయ్యింది ఆ టీచర్. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడి విద్యార్థులు పుస్తకాలు పట్టుకొక రోజులు గడిచిపోతున్నాయి  ఈ క్రమంలోనే మళ్లీ ఒక్కసారిగా చదవడం అంటే ఇబ్బంది అవుతుంది అని భావిస్తున్న కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలో ఉన్న టీచర్ల వద్దకు ట్యూషన్ కి పంపిస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు తమ కొడుకును ఇలాగే ట్యూషన్ కోసం పంపించారు.



 కానీ చివరికి ఇంత దారుణం జరుగుతుంది అని మాత్రం ఊహించలేకపోయారు. ఈ ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. పానిపట్ కు చెందిన దంపతులు తొమ్మిదో తరగతి కుమారున్ని ట్యూషన్ కోసం 20 ఏళ్ల యువతిని పంపించారు  ఇక గత మూడు నెలల నుంచి మైనర్ బాలుడు ఇక ఆ యువతి ఇంటికి ట్యూషన్ కోసం వెళ్తూ వచ్చేవాడు. కాగా గత నెల 29న ట్యూషన్ కోసం వెళ్లిన బాలుడు మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఇక టీచర్ ఇంటికి వెళ్లగా అక్కడ తమ కూతురు కూడా కనిపించడం లేదు అంటూ టీచర్ తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఇక మైనర్ బాలుడి తల్లిదండ్రులు టీచర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 14 ఏళ్ళ బాలుడిని తీసుకెళ్లిన ఆ టీచర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: