కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. బీజేపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ... రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ, హిందుత్వం అంశాలను రాహుల్ ప్రస్తావించారు. తాను హిందువునే అంటూ ప్రకటించిన రాహుల్... హిందుత్వ వాదిని మాత్రం కాదన్నారు. భారత్ హిందువుల దేశమని... అంతే కాని హిందుత్వ వాదులది మాత్రం కాదన్నారు. గాంధీ కూడా హిందువే అన్నారు. అయితే... గాడ్సే హిందుత్వ వాది అని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. వాటిని అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాహుల్ ఆరోపించారు. అధికారం కోసం పాకులాడే వాళ్లు హిందుత్వ వాదులంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు రాహుల్. ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారని... 70 ఏళ్లు కాంగ్రెస్ కష్టపడి నిర్మించిన దేశాన్ని... మోదీ... తన మిత్రులకు దోచిపెట్టారని ఆరోపించారు. ప్రతి ఎన్నికల సమయంలో కులం, మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని ప్రియాంక వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. బీజేపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ... రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ, హిందుత్వం అంశాలను రాహుల్ ప్రస్తావించారు. తాను హిందువునే అంటూ ప్రకటించిన రాహుల్... హిందుత్వ వాదిని మాత్రం కాదన్నారు. భారత్ హిందువుల దేశమని... అంతే కాని హిందుత్వ వాదులది మాత్రం కాదన్నారు. గాంధీ కూడా హిందువే అన్నారు. అయితే... గాడ్సే హిందుత్వ వాది అని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. వాటిని అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాహుల్ ఆరోపించారు. అధికారం కోసం పాకులాడే వాళ్లు హిందుత్వ వాదులంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు రాహుల్. ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారని... 70 ఏళ్లు కాంగ్రెస్ కష్టపడి నిర్మించిన దేశాన్ని... మోదీ... తన మిత్రులకు దోచిపెట్టారని ఆరోపించారు. ప్రతి ఎన్నికల సమయంలో కులం, మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని ప్రియాంక వ్యాఖ్యానించారు.