మోదీ ప్రభుత్వం రైతులకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తూ వస్తుంది.. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కొంత నగదును అందించారు.. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది కేంద్రం. రైతులు అనేక విధాలుగా సబ్సిడీ ప్రయోజనాల ను పొందుతున్నారు. వ్యవసాయం లో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈసారి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది. సబ్సిడీపై డ్రోన్లను సద్వినియోగం చేసుకోవచ్చు. డ్రోన్‌లను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కూడా పొందవచ్చు.


వ్యవసాయం లో డ్రోన్లను ఉపయోగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వీటి కోసం రైతులను ప్రోత్సహించేందుకు దాని కొనుగోలు పై సబ్సిడీ ఇచ్చే పథకాన్ని సిద్ధం చేశారు. డ్రోన్‌ కు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీ, గరిష్టంగా రూ. 5 లక్షల వరకు రైతుల కు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతోంది. డ్రోన్ల సహాయంతో రైతులు తక్కువ సమయంలో పొలంలో నిలబడి పంటలపై సులభంగా ఎరువులు, ఇతర పురుగు మందులను పిచికారీ చేయవచ్చు. దీంతో రైతులకు చాలా సమయం ఆదా అవుతుంది. దీనితో పాటు పురుగుమందులు, మందులు, ఎరువులు కూడా ఆదా అవుతుంది.


వ్యవసాయ ఖర్చు ను తగ్గించడాని కి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన పథకాలను అమలు చేసింది. దీంతో రైతుల ఆదాయాన్ని పెంచవచ్చు. డ్రోన్ల కొనుగోలుపై రైతులకు సబ్సిడీ ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల కు చెందిన చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతులకు డ్రోన్‌ల ధరలో 50 శాతం చొప్పున గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇతర రైతులకు డ్రోన్‌ల కొనుగోలుకు 40 శాతం లేదా గరిష్టంగా రూ. 4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు.. రుణాల ద్వారా తీసుకున్న వారు సకాలంలో చెల్లించిన వారికి మళ్ళీ కొత్తగా రుణాలను అందించనున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: