మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 78 శాతం ప్రజామోదం ఉందని 'మార్నింగ్‌ కన్సల్ట్‌' అనే సర్వే సంస్థ తెలిపింది. ప్రపంచ నాయకులు అందరికంటే కూడా అధిక జనాదరణ ఉన్న నేతగా ప్రధాని నరేంద్ర మోడీనే ముందున్నారని ఆ సంస్థ స్పష్టం చేసింది.మొత్తం 22 మంది దేశాధినేతల్లో నరేంద్ర మోడీ అత్యధిక రేటింగ్‌ ని సంపాదించుకున్నారు.భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశాధినేతల సర్వేలలో తన అధిపత్యాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తున్నారు. వరుసగా రెండో సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోడీ నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ గ్లోబల్ లీడర్‌ అప్రూవల్‌ పేరుతో దేశాల్లో నిర్వహించిన సర్వేలో మన ప్రధాని నరేంద్ర మోడీని ఏకంగా 78శాతం మంది ప్రజలు ఆమోదించారు. మోడీ తరువాత స్థానంలో 68 శాతంతో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ రెండో స్థానంలో ఉన్నారు.


ఆ తరువాత అమెరికా అధినేత అయిన జోబైడెన్‌ ఈ సంవత్సరం ఒక స్థానం దిగజారి మొత్తం 40 శాతంతో ఏడో స్థానంలో నిలిచారు.ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 22 దేశాల అధినేతలపై జరిపిన ఈ సర్వేలో నార్వే ప్రధాని జోనాస్‌ గహర్‌ 21 శాతంతో చిట్టచివరి స్థానంలో నిలవడం జరిగింది. ఇంకా అలాగే దక్షిణ కొరియా అధ్యక్షుడు అయిన యూన్ సియోక్ యుల్ ఇంకా జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా వరుసగా 20,21 స్థానాల్లో ఉన్నారు. ఇటలీ దేశానికి కొత్తగా ఎన్నికైన తొలి మహిళా ప్రధానమంత్రి జార్జియా మెలోని 52 శాతం ప్రజామోదంతో ఆమె 6వ స్థానంలో నిలిచారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అయిన ఆంథోనీ అల్బనీస్ 58 శాతం ఆమోదంతో 4వ స్థానంలో నిలిచారు. బ్రెజిల్‌కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా 50 శాతం ఆమోదంతో 5వ స్థానంలో ఇంకా కెనడా ప్రధాని 40 శాతం ఆమోదంతో 9వ స్థానంలో అలాగే యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతం ప్రజామోదంతో 12వ స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: