ఏపీ సీఎం జగన్ క్రైస్తవుడు.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. కానీ ఆయన అన్ని మతాలను సమానంగానే చూస్తారు. ఇటీవల ఆయన ఎక్కువగా హిందూ స్వామీజీలనూ కలుస్తున్నారు. వారి సలహాలు కూడా తీసుకుంటున్నారు. కానీ జగన్ క్రిస్టియన్ అన్న విషయాన్ని అడ్డుపెట్టుకుని జగన్ సర్కారుపై బురద జల్లేందుకు కొందరు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. వీరి వెనక టీడీపీ హస్తం ఉందని తెలుస్తోంది.


తిరుమల లో అన్యమత ప్రచారం జరుగుతోందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసినవారిలో హైదరాబాద్‌కు కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కాటేపల్లి అరుణ్‌కుమార్‌, హైదరాబాద్‌కు చెందిన గరికపాటి కార్తీక్‌, మిక్కినేని సాయిఅభితేజ్‌లు ఉన్నారు. తిరుమలలో చర్చిలు ఉన్నాయంటూ వీరు అసత్యవార్తలు ప్రచారం చేస్తున్నారని కూడా పోలీసులు గుర్తించారు.


జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేసిన ఈ కుట్ర వెనుక టిడిపి అదినేత చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు.. నిందితులంతా కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడుని స్వయంగా కలిశారని కూడా పోలీసు విచారణలో వెల్లడైందట. వీరిని టీడీపీ పొలిటకల్‌ అడ్వైజర్‌ ఈతకోట జయప్రకాశ్‌ చంద్రబాబుకు పరిచయం చేశారట. అప్పటి నుంచి తిరుపతిలో అన్యమత ప్రచారం అంటూ వీరు కుట్రలకు పాల్పడినట్టు తెలుస్తోంది.


తాము గతంలో టీడీపీ కార్యకర్తలుగా పనిచేసినట్టు నిందితులు పోలీసుల విచారణలో కూడా అంగీకరించారని చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయాలని చంద్రబాబే తమను ఆదేశించినట్టు వీరి పోలీసులకు చెప్పారట. జగన్‌మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టుల పెట్టాలని వారికి స్పష్టం చేశారట. ఈ దుష్ప్రచారంపై సీరియగా దృష్టి పెట్టిన ప్రభుత్వం.. తీగ కదిలిస్తే డొంకంతా బయటపడింది. మతాన్ని అడ్డుపెట్టుకుని ఇలా రాజకీయాలకు పాల్పడటం అత్యంత హేయం, దుర్మార్గం.


మరింత సమాచారం తెలుసుకోండి: