అక్రమ సంబంధం అనేది ఈరోజుల్లో కామన్ అయిపోయింది.. ఎలాగంటే భార్య వుండగానే మరో మహిళతో లేదా భర్త వుండగానే మరో మగాడితో ఎఫైర్స్ పెట్టుకొంటూ చాలా మంది వస్తున్నారు.. అలాంటి వారు ఎన్నో తప్పులను చేస్తూ అడ్డంగా దొరికిపోయి నవ్వులు పాలవుతూ వస్తున్నారు.. అయితే ఇక్కడ ఓ మహిళ ప్రియుడితో తన రాసలీలలు  చేయడానికి భర్త అడ్డుగా ఉన్నాడని చంపి బొంద పెట్టింది.. 

 

 


అసలు విషయానికి వస్తే..అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే కిరాతకంగా చంపేసిందో మహిళ. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో వెలుగుచూసింది. బోధన్‌ మండలం మందర్నా గ్రామానికి చెందిన గంగామణికి కోటగిరి మండలం కల్లూరుకు చెందిన సాయినాథ్‌ (36)తో పదేళ్ల కిందట వివాహమైంది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. ఆరేళ్ల కూతురు ఉంది. గంగామణికి అదే గ్రామానికి చెందిన సుభాష్‌ అనే వ్యక్తితో కొన్నాళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉంది.

 

 


ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు .. అయిన ఆమె పద్దతి ఎక్కడ మార్చుకోలేదు.. దీంతో ఆమెను మందలించాడు.. అయిన ఆమె దోరణి మార్చుకోలేదు.. ఇదే విషయంపై భార్యభర్తల మధ్య శుక్రవారం సాయంత్రం గొడవ జరిగింది. దీంతో గంగామణి తన తండ్రి నాగూరావు, పెదనాన్న పీరాజీ, ప్రియుడు సుభాష్‌తో కలిసి భర్తను కర్రలతో కొట్టి చంపేసింది.సాయినాథ్ మృతదేహాన్ని సుభాష్ బైక్‌పై తీసుకెళ్లి మంజీరా నది ఒడ్డున పూడ్చిపెట్టాడు. తన కొడుకు కనిపించడం లేదని సాయినాథ్‌ తల్లి కోడలిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గంగామణిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మృత దేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: