దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడవు ముగిసింది. ఫైనల్‌గా బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. మరోవైపు, క్యాంపెయింగ్‌లో కాక పుట్టిస్తున్న పాలక ప్రతిపక్షాలు.. మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకూ మొత్తం 46 మంది నామినేషన్లు వేయగా.. అందులో 12 నామినేషన్లు సరిగా లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. మరో 11 మంది నామినేషన్‌లను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో 23 మంది అభ్యర్థులు ఫైనల్‌గా పోటీ పడుతున్నారు. అయితే, ఇండిపెండెంట్లకు తోడు చిన్నాచితక పార్టీల అభ్యర్థులు ఎందరున్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే నెలకొంది.

ఇక ఇప్పటికే ప్రచారంలో నువ్వా?నేనా? అన్నట్టుగా పోటీపడుతున్నారు పాలక, ప్రతిపక్షాలు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరపున అన్నీతానై ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు .. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌.. కేంద్రమే ఇస్తుందని దుబ్బాకలో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు హరీష్‌. బీడీ కార్మికులకు కేంద్రం పెన్షన్ ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.  

మరోవైపు.. కాంగ్రెస్‌, బీజేపీలు సైతం టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ ప్రచారంలో వేడిని పెంచాయి. ఈసారైనా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేస్తుండగా.. ఒక్కసారి గెలిపించి చూడండని బీజేపీ కోరుతోంది. మొత్తంగా, పార్టీలన్నీ ఓటర్లను కాకా పట్టడంలో బిజీ అయ్యాయి. కాగా, నవంబర్‌ 3న, దుబ్బాకలో పోలింగ్‌ జరగనుండగా.. 10న ఫలితం వెల్లడికానుంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దుబ్బాక ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. పోటీలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వెంత అంటే నువ్వెంత అనేలా.. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మాటల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.











మరింత సమాచారం తెలుసుకోండి: