ఇటీవలే జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత భారీ మెజర్టీ తో గెలిచిన సంగతి తెలిసిందే.. తెలంగాణ గులాబీ పార్టీ పని అయిపోయిందన్న వారికి ఇదో పెద్ద దెబ్బ అని చెప్పాలి.. రానున్న దుబ్బాక, గ్రేటర్ , ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ ఎన్నిక మంచి బలం అవుతుందని చెప్పనవసరం లేదు.. ఈ దెబ్బతో ఇన్నాళ్లు పార్టీ పై ఉన్న వ్యతిరేకత కాస్త బలపడే దిశగా వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..
ఇక ఇక్కడ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ఇక్కడకి పంపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లలో ఐక్యత లేదు కానీ… దుబ్బాకలో మాత్రం ఎవరికి వారు కష్టపడి.. తమ ప్రతాపం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్రనేతలంతా తలా ఓ మండలం బాధ్యత తీసుకోవడంతో.. ఆయా మండలాల్లో మెజార్టీ తెప్పించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వారంతా.. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష రేస్ నడుస్తోంది. ఈ రేసులో నెగ్గాలంటే… కొత్తగా తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ అయిన మాణిగం ఠాకూర్ని మెప్పించాలి. ఆయనను మెప్పించాలంటే.. పొగడ్తలతో కావడంలేదు. పనితీరుతోనే సాధ్యం. ఆ విషయం ఇప్పటికే సీనియర్లకు స్పష్టమయింది. అందుకే.. దుబ్బాకలో చెమటోడుస్తున్నారు.