ఈ మధ్య కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కడికక్కడ పెరిగిపోతూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు బయట తిరిగే ఆకతాయిల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొని  సమస్యలను ఇంట్లో వాళ్లకి చెప్పుకునేవారు ఆడపిల్లలు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఇంట్లో వాళ్ళు నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్న తరుణంలో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ముఖ్యంగా సొంత వాళ్లే ఏకంగా దారుణంగా ఆడపిల్లల విషయంలో వ్యవహరిస్తుండటం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు ఇలాంటి ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూ సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి.



 తాజాగా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఓ బాలికను సొంత వదిన ఏకంగా వ్యభిచార గృహానికి అమ్మేసిన దారుణ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. ఇక హింస భరించలేక పోయిన బాలిక చివరకు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన ఓ బాలిక పదవ తరగతి చదివి ఇంటి వద్దే ఉంటుంది. ఇక తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో సోదరుని ఇంట్లో ఉంటూ ఆశ్రయం పొందుతున్నది  సదరు బాలిక.



 ఈ క్రమంలోనే కన్నతల్లిలా చూసుకోవాల్సిన అన్న భార్య.. చివరికి ఆ బాలిక పై కక్ష కట్టింది. ఎవరూ చేయని విధంగా నీచంగా ఆలోచించి సదరు బాలికను వ్యభిచార గృహానికి విక్రయించింది బాలిక వదిన. ఈ క్రమంలోనే ఓకూరు సమీపంలో బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంది. రోజురోజుకు నరకం అనుభవించిన బాలిక ఓ రోజు ధైర్యం చేసి అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం తెలిసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి నిర్వాహకులను అరెస్టు చేశారు. అంతే కాకుండా మరిన్ని వివరాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: