ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనే విషయం తెలిసిందే. సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు. ఏకంగా  భారత్ లో కొన్ని ప్రాంతాలలో అయితే పెట్రోల్ ధరలు సెంచరీ కొడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. ఈ  నేపథ్యంలో సామాన్య ప్రజలందరూ వాహనం బయటకు తీయాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే వివిధ రకాల ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారూ అన్న విషయం తెలిసిందే.


 పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇక దీనిని క్యాష్ చేసుకుంటున్న డిజిటల్ పేమెంట్ యాప్స్ తమ యాప్ ద్వారా పేమెంట్లు చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది అంటూ ఎంతో మంది వాహనదారులను ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే  వాహనదారులు కూడా ఇక క్యాష్ ప్యాక్ ఎంత వచ్చినా చాలు అనుకుంటూ వివిధ  డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారానే పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ఏదేమైనా అటు పెరిగిపోయిన పెట్రోల్ ధరలతో సామాన్యులపై భారం కూడా మరింత పెరిగిపోయింది అని చెప్పాలి.



 అయితే ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ మీ కోసం అందుబాటులో ఉంది ఏకంగా 1, 2 లీటర్లు కాదు 50 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పొందేందుకు అవకాశం ఉంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు క్రెడిట్ కార్డు తో పెట్రోల్ బంకుల్లో పేమెంట్ చేస్తే సరిపోతుంది.  ఇటీవలే హెచ్డిఎఫ్సి తమ ఖాతాదారులకు పెట్రోల్ డీజిల్ ఫ్రీగా పొందే అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే హెచ్డిఎఫ్సి వినియోగదారులు  పెట్రోల్ బంకుల్లో తమ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే ఫ్యూయల్ పాయింట్లు ఇస్తుంది హెచ్డిఎఫ్సి. ఇక వాటిని రీడిమ్  చేస్తే 50 లీటర్ల వరకు పెట్రోల్ ఫ్రీగా ఇస్తారు అంటూ హెచ్డిఎఫ్సి ఆఫర్ ప్రకటించింది. ఇక ఈ బంపర్ ఆఫర్ కి ప్రస్తుతం వాహనదారులు బాగా ఆకర్షితులవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: