చైనా నుంచి కరోనా మహమ్మారి ఏమంటూ పుట్టుకొచ్చిందో కాని ప్రపంచం మొత్తాన్ని హడలు పుట్టిస్తుంది. మొదటి వేవ్ తో ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ తో భారత్ సతమతమవుతుంది.భారతదేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా రోజు రోజుకి చాలా ఎక్కువవుతున్నాయి. ఏం చెయ్యాలో తెలీక ప్రభుత్వం తల పట్టుకొని కూర్చుంది. ఇక పరిస్థితి ఎలా ఉందంటే మిత్ర దేశాలు కూడా మనల్ని చూసి భయపడుతున్నాయి.కరోనావైరస్ కేసులు పెరగడంతో, కొన్ని దేశాలు ప్రయాణ పరిమితులను అమలు పరచడం మనం చూస్తున్నాము.

ఉదాహరణకు, అమెరికన్లకు వర్తించనప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ భారతదేశ ప్రయాణ నిషేధాన్ని ప్రవేశపెడుతుందని నిన్న ప్రకటించారు.ఇక ఆస్ట్రేలియా కూడా ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో ప్రయాణ నిషేధాన్ని ప్రకటించింది.ఆస్ట్రేలియా పౌరులు మరియు నివాసితులు సాధారణంగా ప్రభుత్వ సదుపాయానికి వచ్చిన తరువాత సుదీర్ఘ నిర్బంధంతో స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతించబడినప్పటికీ, ఆస్ట్రేలియా చాలా మంది విదేశీయులను తమ దేశానికి రానివ్వకుండా రవాణా సౌకర్యాలు మూసివేసింది.

2021, మే 3, సోమవారం నుండి, ఆస్ట్రేలియా పౌరులు మరియు నివాసితులు గత 14 రోజులలో భారతదేశంలో ఉంటే తమ దేశానికి తిరిగి రాకుండా నిషేధిస్తుంది. ఈ నిబంధనను ఉల్లంఘించిన ఎవరైనా ఐదేళ్ల వరకు జైలు శిక్ష మరియు  66,000 ఆస్ట్రేలియన్ డాలార్ల వరకు జరిమానా విధించవచ్చు. ఈ పరిమితిని మే 15, 2021 న సమీక్షిస్తారు.అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయాలు తేలికగా తీసుకోదు. ఏదేమైనా, ఆస్ట్రేలియన్ ప్రజారోగ్యం మరియు దిగ్బంధం వ్యవస్థల యొక్క సమగ్రత రక్షించబడటం చాలా క్లిష్టమైనది మరియు దిగ్బంధం సౌకర్యాలలో కోవిడ్ 19 కేసుల సంఖ్యను నిర్వహించదగిన స్థాయికి తగ్గించారు.దీన్ని బట్టి భారత పరిస్థితిని చూసి ప్రపంచ దేశాలు చాలా భయపడుతున్నాయి.కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం కోసం పలు జాగ్రత్తలు పాటించి ప్రపంచ దేశాలు మన ముందు తల వంచుకునేలా చేసుకునేలా మనం పాటు పడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: