అయితే కామాంధుల శిక్షించడానికి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడ పిల్లల పై అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష లాంటి కఠిన శిక్షలు విధించినా ఇక్కడ ఎవరిలో భయం కనిపించడంలేదు. రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి.. కొన్ని కొన్ని సార్లు పక్కన తోడు ఉన్నప్పటికీ రెచ్చిపోతున్నారు కామాంధులు. పక్కనే ఉన్న వ్యక్తిపై దాడిచేసి బంధించి మరీ అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చాయి . ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి 15 రోజుల కిందట బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది ఈ క్రమంలోనే అక్కడ ఓ స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం సముద్రతీరానికి వెళ్ళింది ఈక్రమంలోనే అప్పటికే అక్కడ ముగ్గురు వ్యక్తులు మద్యం తాగుతూ ఉన్నారు ఇక వీరి వద్దకు వచ్చి ఏకంగా స్నేహితుడి పై దాడి చేసి బంధించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే అందులోని మరో వ్యక్తి మరోసారి తన కోరిక తీర్చాలని లేకపోతే ఫోటోలు మొత్తం సోషల్ మీడియా లో పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు బంధువులకు ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.