
తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తల్లి అంత్యక్రియల సమయంలో ఐసిస్ తీవ్రవాదులు ఆత్మహుతి దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో కాబూల్లోని ఖైబర్ ఖానా ప్రాంతంలో ఉన్న ఐసిస్ స్థావరంపై దాడి చేసిన తాలిబన్లు కనిపించిన వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆగస్ట్ 26వ తేదీన కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద యూఎస్ దళాలని లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 170 మంది చనిపోయారు. ఆ తర్వాత కూడా పలుమార్లు తాలిబన్ల టార్గెట్ చేస్తూ ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా కాబూల్ ఈద్గా దాడితో ఆఫ్గాన్ లో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. 2018 నుంచి ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా సైనిక దళాల దూకుడు తగ్గడంతో... ఐసిస్ ఉగ్రవాదులు వరుస దాడులకు తెగబడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలకు రక్షణ కల్పిస్తామని పాల్గొన్న హామీ ఇచ్చిన ఐసీస్ దాడులు మాత్రం తగ్గడం లేదు.