తమిళనాడు రాష్ట్రంలో గత పది రోజులుగా కురిసిన వర్షాలకు ఏకంగా 60 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 70 శాతం పైగా పంట భారీ వర్షాలకు నీటి పాలైనట్లు కేంద్రానికి పంపిన నివేదికలో తమిళనాడు అధికారులు వెల్లడించారు. చెన్నై, విల్లుపురం, కడలూరు, కన్యాకుమారి, ట్యూటికొరన్ సహా దక్షిణ డెల్టా ప్రాంతాలపై వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తగా దాదాపు 2 వేల 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా కోతకు వచ్చిన పంట కూడా నీటిలో నానిపోయిందని... దీని కారణంగా వేల మంది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయినట్లు కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు కూడా నీటితో నిండిపోయి ఉన్నాయని... ఈ పరిస్థితుల్లో మరోసారి వర్షం వస్తే... దిగువ ప్రాంతాల ప్రజలు మరింత ఇబ్బందులు పడతారని కేంద్ర బృందానికి తెలిపారు. నాలుగు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందానికి తమిళనాడు అధికారులు పూర్తి స్థాయి నివేదిక సమర్పించారు. ఏకంగా 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని... తక్షణమే కేంద్రం సాయం చేయాలని తమిళనాడు అధికారులు కేంద్రానికి లేఖ రాశారు.
తమిళనాడు రాష్ట్రంలో గత పది రోజులుగా కురిసిన వర్షాలకు ఏకంగా 60 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 70 శాతం పైగా పంట భారీ వర్షాలకు నీటి పాలైనట్లు కేంద్రానికి పంపిన నివేదికలో తమిళనాడు అధికారులు వెల్లడించారు. చెన్నై, విల్లుపురం, కడలూరు, కన్యాకుమారి, ట్యూటికొరన్ సహా దక్షిణ డెల్టా ప్రాంతాలపై వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తగా దాదాపు 2 వేల 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా కోతకు వచ్చిన పంట కూడా నీటిలో నానిపోయిందని... దీని కారణంగా వేల మంది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయినట్లు కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు కూడా నీటితో నిండిపోయి ఉన్నాయని... ఈ పరిస్థితుల్లో మరోసారి వర్షం వస్తే... దిగువ ప్రాంతాల ప్రజలు మరింత ఇబ్బందులు పడతారని కేంద్ర బృందానికి తెలిపారు. నాలుగు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందానికి తమిళనాడు అధికారులు పూర్తి స్థాయి నివేదిక సమర్పించారు. ఏకంగా 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని... తక్షణమే కేంద్రం సాయం చేయాలని తమిళనాడు అధికారులు కేంద్రానికి లేఖ రాశారు.