ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం ఆ దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు ఆదేశించారు.  శనివారం కోఠి లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష లో కమిషనర్ వాకాటి కరుణతో పాటు, ఆశ, మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, మిడ్ వైఫెరీ, అర్ బి ఎస్ కే, హెచ్ ఎం ఐ ఎస్, టీబీ, టీ - డయాగ్నొస్టిక్స్, 108, 104, యూ పి హెచ్ సి, సాంక్రమిక, అసంక్రమిక వ్యాధులు, పల్లె దవాఖానలు, పి హెచ్ సీ లు, వాక్సినేషన్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లడుతూ  అన్ని కార్యక్రమాల్లో తెలంగాణను అగ్ర స్థానంలో ఉంచాలని, ఆరోగ్య తెలంగాణ  కల సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సూచిల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించాలన్నారు. ఆ దిశగా అధికారులు సత్వర చర్యలకు ఉపక్రమించాలనీ ఆదేశించారు.

విభాగాల వారీగా అధికారులు వారి పని తీరుపై సమీక్షలు నిర్వహించుకోవాలనిని, ప్రతి నెల విభాగాల వారీగా తాను సమీక్ష నిర్వహిస్తాన్నారు.  పనితీరులో నెలవారీ వృద్ది కనిపించాలని, పదోన్నతులు, ప్రోత్సాహకాలకు అదే గీటు రాయి అన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలనీ, రిపోర్టులు సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజారోగ్యానికి నిధులు ఖర్చు చేస్తున్నదని, అదే  స్థాయిలో ఆరోగ్య కార్య క్రమాల  అమలులో  శ్రద్ద చూపించాలన్నారు. రక్తహీనత విషయంలో రాష్ట్రం మరింత మెరుగ స్థితిలో ఉండాల్సి ఉందని, ఈ పరిస్థితి లో మార్పు రావాలన్నారు.  రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ పరిస్థితుల గురించి అడిగి తెల్సుకున్న మంత్రి హరీశ్ రావు, ప్రభావిత జిల్లాల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలన్నారు.
పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిసరాల పరిశ్రుభ్రతను మెరుగు పరుస్తూ, దొమల నివారణ చర్యలు చేపట్టాలని, తద్వారా వ్యాధి వ్యాప్తిని  అరికట్టాలని ఆదేశించారు. ప్రసూతి మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలని, ఆస్పత్రి ప్రసవాలను 97 శాతం నుండి 100 శాతానికి పెంచడం లక్ష్యంగా పని చేయాలన్నారు.  ఇందులో ఎక్కువగా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 
రెండు వారాల్లో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో క్యాథ్ లాబ్స్ సిద్దం కావాలన్నారు.  వచ్చే నెల రెండో వారంలోగా ఖమ్మం లోని క్యాథ్ ల్యాబ్ పనులు పూర్తి చేసి, ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ఆన్ లైన్ ( హెచ్ ఐ ఎం ఎస్ ) లో నమోదు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమైన పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలన్నారు. నెల నెల  పురోగతిపై  సమీక్ష చేస్తా అన్న మంత్రి హరీశ్ రావు... ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యం చేరే క్రమంలో అన్ని రకాల మద్దతు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఉత్సాహంగా పని చేయాలని, ఎలాంటి సమస్యలున్నా  పరిష్కరించేందుకు ప్రభుత్వం మీ వెంట ఉంటుందన్నారు.


ప్రసూతి మరణాలు తగ్గించే విషయంలో  దేశంలో మనం నాల్గవ స్థానంలో ఉన్నామని, మొదటి స్థానంలోకి వచ్చేలా అందరం  ఒక నిర్ధుష్ట ప్రణాళికతో పని చేద్దామని పిలుపునిచ్చారు. టీ డయాగ్నోస్టిక్స్ సేవలు దేశానికే ఆదర్శంగా  నిలిచాయని మంత్రి హరీశ్ రావు గారు అన్నారు.
గత నెల బీహార్ ప్రభుత్వ అధికారులు మన రాష్ట్రాన్ని సందర్శించి టీ  డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రజలకు అందుతున్న  తీరును  పరీశిలించారని,    వచ్చే వారం యూపీ నుండి ఆ తర్వాత కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ బృందాలను రాష్ట్రానికి పంపుతున్నాయన్నారు. ఇవన్నీ మన ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న మెరుగైన సేవలకు నిదర్శనమన్నారు.ఇదే రీతిలో ఆరోగ్య సూచికల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: