ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఏం చేయాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ప్రతి రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని భయపడుతూ  ప్రతి ఒక్కరూ ఇక మళ్ళీ అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక పబ్లిక్ ప్లేస్ లకు వెళ్లడానికి భయపడిపోతున్నారు ప్రతి ఒక్కరు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం కి ప్రజలు కాస్త జంకుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కడం దిగడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎవరికి కరోనా వైరస్ బారిన పడ్డారు అన్నది కూడా తెలియని విధంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్న వారు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమం అని అనుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. కానీ అదే ఇప్పుడు కొత్త భయానికి దారితీసింది. ఆర్టీసీ బస్సులో కండక్టర్ గా పని చేస్తున్న ఓ మహిళ కరోనా వైరస్ బారిన పడింది.దీంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ కండక్టర్ అప్పటివరకు ఎంతో మందికి తన చేతులతోనే టికెట్ అందించడం ప్రయాణికులకు చిల్లర ఇవ్వడం లాంటివి చేసింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ కూడా ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు లో వెలుగులోకి వచ్చింది.. చెన్నూరు లోని ఓ మహిళా కండక్టర్ కరోనా వైరస్ సోకడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారిపోయింది..


 హన్మకొండ చెన్నూరు ఆర్టీసీ బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహిస్తుంది ఓ మహిళ. ఇటీవలే ఎప్పటిలాగానే విధులకు హాజరు అయింది. ఇక ఆమెకు ఎక్కడా  వైరస్ లక్షణాలు కూడా లేవు. ఎంతో ఆరోగ్యంగా ఉంది. కానీ ఇటీవలే బస్సు దిగిన తర్వాత బస్సు డ్రైవర్ తో కలిసి టీ తాగింది ఆ మహిళ కండక్టర్.  ఈ క్రమంలోనే సరదాగా దగ్గరలో ఉన్న ఓ కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కరోనా వైరస్ టెస్ట్ చేయించుకుంది.. ఇక ఈ పరీక్షలో షాకింగ్ నిజం బయటపడింది. సదరు మహిళ వైరస్ బారిన పడిందన్న విషయం తేలింది. దీంతో ఇక ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు .

మరింత సమాచారం తెలుసుకోండి: