దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే... ఇప్పటికే రోజు వారి కేసుల సంఖ్య మరోసారి 3 లక్షలు దాటేసింది కూడా. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ప్రస్తుతం భారీగానే నమోదు అవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే దేశ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఎన్నికలు నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అయితే... బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై కూడా ఆంక్షలు విధించింది. పలు రాష్ట్రాలు కూడా ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అయితే... ఈ నెల 30వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవులు ప్రకటించింది. ఇక ఏపీ సర్కారు అయితే మాత్రం పాఠశాలలకు సెలవులు ఇచ్చేది లేదని తేల్చేసింది. కానీ చాలా ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా మరోసారి కోవిడ్ నిబంధనలపై మరిన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటికే 150 కోట్లకు పైగా డోసులు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పుడు పిల్లలు, 18 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. ఐదేళ్లు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకు మాస్కులు సిఫార్సు చేసేది లేదని కేంద్ర కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న పిల్లల కోసం కొన్ని సూచనలు చేసింది. తగిన విధంగా సురక్షితంగా ఉపయోగించగలిగిన 6 నుంచి 11 సంవత్సరాల వయస్సున్న పిల్లలు తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించింది. 12 ఏళ్లు పై బడిన వయసున్న వాళ్లు... మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను సవరించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ ఆందోళన కలిగించే వైవిధ్యం కావడంతో నిపుణుల బృందం దీనిపై ప్రధానంగా చర్చించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: