ప్రస్తుతం ఏపీలో జగన్ ప్రభుత్వానికి దిన దిన గండంగా మారింది. మొన్నటి వరకు ప్రతిపక్షాలు ఇతర సమస్యలతో పోరాడుతూ వచ్చిన జగన్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులతో తేల్చుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా ఇదంతా కూడా సరైన నిధులు లేకపోవడమే అని అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారుకు మధ్య పీఆర్సీ వివాదం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎడ్డెమ్ అంటే తెడ్డం అన్న వ్యవహారంలా ఎంతకీ తెగేలా లేదు. ఇప్పటికే ఉద్యోగులు రోడ్లెక్కి ఈ విషయం గురించి ధర్నాలు, నిరాన్స్లు తెలపడం వంటివి జరుగుతూ ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఉద్యోగులు ఇదే విషయంపై పీఆర్సీని సవాల్ చేస్తూ హై కోర్ట్ లో పెతితిఒన్ వేసిన సంగతియు తెలిసిందే. అయితే ఈ విషయంపై దాఖలైన పిటీషన్‌ ను విచారించిన హై కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలు నుండి ఎటువంటి రికవరీలు చేయకూడదని  ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దాంతో ప్రభుత్వం నూతన పీఆర్సీ పరుగులకు కళ్లెం పడింది. పీ ఆర్సీ కొత్త జీవోలను మూడు వారాల పాటు ఎప్పటిలాగే ఉండాలి అంటూ ఆదేశించింది.

అంతే కాకుండా జీతాలు, అలివెన్సుల్లో తగ్గుదల కనిపిస్తున్నారు హైకోర్టు ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించింది.   పీఆర్సీ జీవోలపై కౌంటర్ దాఖలు చేయాలని మూడు వారాలు గడువు ఇచ్చింది. దాంతో జగన్‌ సర్కార్‌ కు పెద్ద షాక్ ఎదురయ్యింది. ఐఆర్, HRA అడ్జస్ట్మెంట్ చేస్తామన్న ప్రభుత్వ ఉత్తర్వులపై ఏపీ హై కోర్టు ఇపుడు ఇలా ఆదేశాలు జారీచేయడంతో మళ్ళీ విషయం మొదటికి వచ్చింది. ఉద్యోగుల తరపున పెటిషనర్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ లంచ్ మోషన్  విచారణ కోరగా దీనికి హై కోర్ట్ ససేమిరా అనింది. దీనితో ఉద్యోగులకు హై కోర్ట్ షాక్ ఇచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: