సమయాన్ని బట్టి బండ్లు ఓడలు అవుతాయి. ఓడలు బళ్ళు అవుతాయి అనే సామెత ప్రతి ఒక్కరి విషయంలో నిజం అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు ఆర్థిక సమస్యల కారణంగా దుర్భర జీవితాన్ని గడిపిన వ్యక్తులు ఒక్కసారిగా అదృష్టం కలిసివచ్చి సంపన్నులుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. సకల సౌకర్యాలతో లగ్జరీ లైఫ్ గడిపిన వారు అన్నీ పోగొట్టుకుని చివరికి రోడ్డున పడే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఇక ఇలాంటివి ఎంతో మంది విషయంలో జరుగుతూనే ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అయితే ఊహించని విధంగా ఎంతో మందికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టి సంపన్నులుగా మారుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 సాధారణంగా లక్ష్మీదేవి కటాక్షం కావాలి అంటూ ఎంతో మంది తెగ పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందినీ అదృష్టం వెతుక్కుంటూ వచ్చి వారి జీవితాన్ని మార్చేస్తుంది  అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో కూడా ఇలాగే జరిగింది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి లో గడుపుతున్న ఆ వ్యక్తికి ఒక అనుకోని అదృష్టం వరించింది. ఒక్కసారిగా లక్షాధికారినీ చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా లో వెలుగు చూసింది. రాణిగంజ్ లో నివాసముండే నంది లాల్  రజాక్ అనే వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. కుటుంబ పోషణ కోసం కిరాణా కొట్టులో నెల జీతానికి పని చేస్తున్నాడు.


 అయితే ఇటీవలే రోజు లాగానే అతను  కొట్టు లో పనిచేయడం కోసం వెళ్తున్న  సమయంలో మార్గమధ్యంలో  ఏదో రాయి మెరుస్తూ కనిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలించిన అనంతరం అది రంగు రాయి అని భావించాడు. అయితే ఇంటికి తీసుకువెళ్ళి కుటుంబ సభ్యులకు చూపించాడు.  అది డైమండ్ అయి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. స్నేహితులను వెంటబెట్టుకుని డైమండ్ టెస్ట్  కేంద్రానికి వెళ్లి టెస్టు చేయించాడు. దీంతో అది 2.83 క్యారెట్ల వజ్రం అని అధికారులు నిర్ధారించడంతో ఎగిరి గంతేసాడు. దాని ఖరీదు 5 లక్షల వరకు ఉంటుందని.. ఇక వేలం పాటకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. వేలంపాటలో వచ్చిన డబ్బును అతనికి అందజేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: