గుంటూరు ఎంపీ టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో శరవేగంగా ముందుకు వెళుతున్నారు.. అక్కడ నియోజవర్గంలో రోడ్డు షో చేస్తూ అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 1983 లో ఒక బలమైన భావజాలంతో పుట్టిందంటూ తెలియజేశారు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే అంశంతోనే ఈ పార్టీ వెలసింది అని కూడా వెల్లడించారు. అదే అంశాలతో ఈరోజు పుట్టిన పార్టీ జనసేన పార్టీ అంటూ పవన్ కళ్యాణ్ అంశం తన అంశం ఒకటే అని కూడా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారికి డబ్బు మీద ఎలాంటి ప్రేమ లేదు కీర్తి లేదని కేవలం ప్రజలకు న్యాయం చేయాలని ఉద్దేశంతోనే ఉంటారని తెలిపారు.


గుంటూరు ఎంపీగా తాను ఐదు సంవత్సరాలుగా ఒక వ్యక్తిని చూశాననీ ..మరి అతనికి సీఎం జగన్ ఒక ప్రమోషన్ కూడా ఇచ్చారని ఆ ప్రమోషన్ దేన్ని చూసి ఇచ్చారు అంటూ విమర్శించారు.. ఈ సమయంలోనే సీఎం జగన్ పైన కూడా విరుచుకుపడడం జరిగింది..

సద్దాం హుస్సేన్ అనేటువంటి వాడు ఒక నియంత బంకర్ నుంచి లాక్కొచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపారు.. జగన్ కూడా అదే గతి పడుతుంది. ఈ విషయాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ విషయం పైన ప్రముఖ జర్నలిస్టు సాయి మాట్లాడుతూ.. సీఎం జగనన్న ఇలా అనడం తప్పులేదు కానీ.. సద్దాం హుస్సేన్ లాంటి మంచి నాయకుడిని ఇలా అంటారా.. ముస్లింలకు వ్యతిరేకమేనండి.. సద్దాం లాంటివారు అరాచకం చేయబట్టే కాబట్టి ఆ రోజు అలా జరిగిందని వెల్లడించారు. ఇది ఒక రకంగా కరెక్టే..

అతడిని అన్యాయంగా చంపేయడం వాస్తవమే.. ఏవో చాలా భయంకరమైన బాంబులు అతని దగ్గర ఉన్నాయని.. అందువల్లే అమెరికా అతనిని చంపేసిందని .. అయితే తీరా చూస్తే అతని దగ్గర అలాంటివి ఏమీ లేవని.. అయితే సద్దాం హుస్సేన్ ని మోస పూర్వకంగానే చంపారని.. అయితే ఇప్పుడు అలా జగన్ ని మోసపూర్వకంగానే అంతం చేస్తామని చెబుతున్నారా .. అట్లా అన్యాయంగా అంతం చేస్తామని చెబుతున్నారా .. ఇదే అర్థం కానటువంటి మిలియన్ల ప్రశ్న అంటూ ప్రముఖ జర్నలిస్ట్ సాయి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: