ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్శీపట్నంలో అన్న దమ్ముల మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేత. ఆయన తమ్ముడు నర్శీపట్నం మున్సిపాలిటీ మాజీ వైఎస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు వైసీపీలో ముఖ్య నేతగా ఉన్నారు. తన అన్న అయ్యన్న ఓటమిని తమ్ముడు కోరుకుంటున్నారుఅయిదేళ్ల క్రితం నుంచి అన్నదమ్ముల మధ్య రాజకీయ సమరం చాలా రసవత్తరంగా సాగుతోంది.ఇక ఇదిలా ఉంటే అయ్యన్నపాత్రుడు కుటుంబానికి ఇలవేలుపుగా మరిడి మహలక్ష్మి అమ్మ వారు ఉన్నారు.అమ్మవారి ఉత్సవాలు కూడా సరిగ్గా ఎన్నికల సీజన్ లో వచ్చాయి. దాంతో రాజకీయంతో పాటు అన్ని అంశాలు కూడా ఈ అన్న దమ్ముల మధ్య తాజాగా కొత్త చిచ్చు పెట్టాయి. ఈ నెల 15 నుంచి 23 దాకా అమ్మవారి ఉత్సవాలకు రంగం సిద్ధం కానుంది.ఈ నేపధ్యంలో అమ్మవారి నగలు తమ్ముడి ఇంట్లో ఉన్నాయని వాటిని ఈసారి అమ్మవారికి అలంకరించకపోతే తాను తమ్ముడి మీదనే పోలీసు కేసు పెడతానని మాజీ మంత్రి అయ్యన్న హెచ్చరించడం జరిగింది.


అయితే దానికి ధీటుగా తమ్ముడు సన్యాసిపాత్రుడు బదులిచ్చారు. ఆ నగలను తాను ఎంతో భద్రంగానే ఉంచానని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మ వారికి అలంకరిస్తామని ఆయన చెప్పారు.అయ్యన్నపాత్రుడు అమ్మవారి పేరుతో వసూల్ చేసిన ఆరు లక్షల రూపాయల నగదు విషయంలో కూడా బాధ్యత వహించకపోతే తాను కూడా పోలీసు కేసు పెడతానని తమ్ముడు సన్యాసిపాత్రుడు హెచ్చరించడం జరిగింది. దీంతో అమ్మ వారి సాక్షిగా అన్న దమ్ముల సమరానికి తెర లేచింది.అయ్యన్న విషయానికి వస్తే సుదీర్ఘ రాజకీయ జీవితంలో పదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.ఈయన ఈసారి గెలిచి రాజకీయాల నుంచి రిటైర్ కావాలని అయ్యన్న చూస్తున్నారు. అయ్యన్నను ఓడించి వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ ని గెలిపించాలని తమ్ముడు చాలా పట్టుదల మీద ఉన్నారు.అందువల్ల అమ్మ వారు సాక్షిగా అన్నదమ్ములు కత్తులు దూస్తున్న నేపధ్యం ఉంది. దీంతో ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం  నర్శీపట్నంలో నెలకొంది. వీరిద్దరి మధ్య పోరు చాలా రసవత్తరంగా సాగుతుంది.చూడాలి ఎవరు నెగ్గుతారో..

మరింత సమాచారం తెలుసుకోండి: