
లోకేష్ గత ఐదేళ్ల రాష్ట్ర పాలనను విమర్శిస్తూ, అది విధ్వంసకరమైనదని, సైకో పాలనగా అభివర్ణించారు. ఈ కాలంలో రాష్ట్రం దారితప్పిందని, అయినప్పటికీ ఎన్నికల సమయంలో తెలుగు డయాస్పోరాలో కొందరు ఆరు నెలలపాటు ఆంధ్రప్రదేశ్లో కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తోడ్పడ్డారని కొనియాడారు. చంద్రబాబు అరెస్టయిన సమయంలో హైదరాబాద్లో 45 వేల మంది ఐటీ నిపుణులు ఆయనకు మద్దతుగా నిలిచారని, ఇది తమకు భారీ ధైర్యాన్ని ఇచ్చిందని లోకేష్ తెలిపారు. ఈ సంఘటన తెలుగు జాతి ఐక్యతను బలంగా చాటిందని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో లోకేష్ భార్య బ్రాహ్మణి రాజకీయ పోరాటం అవసరమా అని ప్రశ్నించినప్పటికీ, తెలుగు ప్రజల మద్దతు లోకేష్కు స్ఫూర్తినిచ్చింది.
ఈ సందర్భంలో ఆయన తెలుగు జాతిని అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలపాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. అమరావతి, విశాఖపట్నం వంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రం పునరుద్ధరణకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన వివరించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు