
ఈ మెగా సమావేశం విద్యా సంస్కరణలను చర్చించేందుకు, తల్లిదండ్రులతో సమన్వయం బలోపేతం చేసేందుకు ఒక వేదికగా నిలిచింది. 61,000కి పైగా విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం జరిగింది. లీప్ యాప్ ద్వారా సేకరించిన డేటా, ఫోటోలు, వీడియోలతో గిన్నీస్ రికార్డు ధృవీకరణ జరిగింది. 40 మందికి పైగా ఆడిటర్లు ఈ సమాచారాన్ని పరిశీలించి రికార్డును ధృవీకరించారు. విద్యార్థుల పురోగతి కార్డులు పంపిణీ చేయడం, సామాజిక అవగాహన కల్పించడం ఈ కార్యక్రమంలో ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయి.ఈ కార్యక్రమ విజయానికి ఉపాధ్యాయుల కృషి అమూల్యమని నారా లోకేష్ కొనియాడారు.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థుల సమిష్టి కృషి ఈ ఘనత సాధ్యపడిందని ఆయన వివరించారు. జాతీయ విద్యా విధానం అమలు ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఈ రికార్డు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అభివర్ణించారు. ఈ సమావేశం విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు బాటలు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర విద్యా వ్యవస్థను జాతీయ స్థాయిలో ఒక ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడం ఈ సమావేశం ఉద్దేశం. ఈ రికార్డు సాధన రాష్ట్రంలో విద్యా రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, ప్రజల సహకారంతో మరిన్ని విజయాలు సాధించవచ్చని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు