బెంగళూరు నుంచి వచ్చిన జగన్ .. వాస్తవంగా గత వారం అయితే ఆంధ్రా కార్యక్రమాలలో ఏ విధంగా పాల్గొనలేదు.. అంతకుముందు వారం ఏపీలో జరిగిన కొన్ని విషయాలలో పాల్గొన్నారు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లారు. అయితే ఈ వారం మాత్రం రావడమే గవర్నర్ బంగ్లా కి వెళ్లడం.. గవర్నర్ ని కలవడం ఏదైతే లిక్కర్ స్కామ్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారో అన్నటువంటి అంశము , దాని వెనుక ఉన్న వివరాలన్నిటిని తీసుకొని గవర్నర్ వద్దకు వెళ్లారు.


తాజాగా సోదాలు ఏవైతే జరిగాయో భారతీ సిమెంట్ కి సంబంధించిన వివరాలన్నిటినీ కూడా తీసుకువెళ్లి చూపించడం లాంటిది జరిగిందట. ఇదే అక్కడ కీ పాయింట్. అయితే ఇక్కడ రెండు కోణాలు.. ఒకటి ప్రతిపక్షంగా తమని వేధిస్తున్నారంటూ గవర్నర్ కి కంప్లైంట్ చేయడం. ఇది రొటీన్ ప్రాసెస్.. కానీ మరొకటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తన అభిప్రాయాన్ని తీసుకెళ్లగలిగిన మీడియేటరే ఇప్పుడు గవర్నర్. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు తృ-గవర్నర్ ద్వారానే తీసుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేశారు.


ఆంధ్రప్రదేశ్లో వైసిపి నేతలను టార్గెట్ చేసుకొని ప్రభుత్వం వారి పైన తప్పుడు కేసులు నమోదు చేస్తోందనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారని మాజీ సీఎం తెలుస్తోంది. గవర్నర్ అపాయింట్మెంట్ లభించడంతో తాడేపల్లి కి వచ్చి ప్రభుత్వం తమ నేతల పైన నమోదు చేస్తున్న కేసులతో పాటు జిల్లాల పర్యటనలు విధిస్తున్న ఆంక్షలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా గవర్నర్ ముందు పెట్టినట్టుగా వినిపిస్తున్నాయి. అనంతరం ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారట. అలాగే ఈ నెల 31న నెల్లూరుకి వెళ్లి మాజీ మంత్రి కాకాణితో ములాఖత్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఆ తర్వాత వచ్చే నెల 5వ తేదీన ఎంపీ మిథున్ రెడ్డితో కూడా భేటీ కాబోతున్నారట. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రామర్శించడానికి వెళ్ళబోతున్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: