
శ్రీనివాసరావు చెప్పుతూ.." 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 28న మరో రూ.20 లక్షలు కేశినేని చిన్ని పీఏ మోహన్కి ట్రాన్స్ఫర్ చేశానని" చెప్పారు. అంతేకాదు, గొల్లపూడి ప్రాంతంలో తన స్నేహితుల ద్వారా దాదాపు రూ.3.5 కోట్లు నగదుగా ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద ఐదు కోట్ల రూపాయల లావాదేవీ జరిగిందని ఆయన తెలిపారు.అంతేకాకుండా, “ఈ విషయానికి సంబంధించిన అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలు నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చెప్పినా దానికి సాక్ష్యాలున్నాయి. రేపు ఈ వ్యవహారం గురించి పూర్తి వివరాలు బయటపెడతాను” అని కోలికపూడి బహిరంగంగానే తెలిపారు. ఆయన పెట్టిన పోస్టులో “నిజం గెలవాలి… నిజమే గెలవాలి” అనే వాక్యం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది.
