
ఇక అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం రాజకీయంగా కొత్త హాట్ స్పాట్గా మారింది. అక్కడ ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్ పై స్థానిక మత్స్యకారులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వైసీపీ నేతలు ఆ మత్స్యకారులకు మద్దతు ప్రకటించడం అనేది ఒక విధంగా హోంమంత్రి అనితకు డైరెక్ట్ చాలెంజ్ గా టీడీపీ భావిస్తోంది. జగన్ స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించబోతున్నట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడంతో పాయకరావుపేటలో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది. అంటే జగన్ పర్యటన అనిత నియోజకవర్గంలో జరుగుతుండడం.. వైసీపీ వర్సెస్ అనిత ఫైట్ మరింత వేడి పుట్టించనుంది. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం ఇది రాజకీయ కుట్ర అని చెబుతున్నారు. “రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయన్నదే వాస్తవం.
కానీ ఆ కారణంగా హోంమంత్రినే టార్గెట్ చేయడం అన్యాయం” అని వాదిస్తున్నారు. అనిత జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారన్న కారణంగానే వైసీపీ నేతలు ఆమెను టార్గెట్ చేస్తున్నారని టీడీపీ శ్రేణులు బహిరంగంగా చెబుతున్నాయి. దీనికి సమాధానంగా వైసీపీ నేతలు మాత్రం, “ఒక ఘటన జరిగితే ప్రతిపక్ష పార్టీగా స్పందించడం మా బాధ్యత. అందులో ఎవరినీ ప్రత్యేకంగా లక్ష్యంగా చేయడం లేదు” అంటూ తాము చేసిన విమర్శలకు సమర్థన చెబుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వాతావరణం ఒక్కదారి మీదే ఉంది — #VangalapudiAnitaVsYSRCP అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. మొత్తం మీద పాయకరావుపేట నుంచి పులివెందుల వరకు రాజకీయ చర్చ ఏదంటే - "వైసీపీ వర్సెస్ వంగలపూడి" యుద్ధం మొదలైపోయింది! ఈ రాజకీయ వేడి రాబోయే వారాల్లో ఏ స్థాయికి చేరుతుందో చూడాలి!