మోడీకి మల్లే రాహుల్ కూడా యోగా చేయడం మొదలుపెడితే కాంగ్రెస్ కు భవిష్యత్ ఉండవచ్చని ఆయన అంటున్నారు. మోడీని మొదలుకుని, గతంలో కాంగ్రెస్  కీలక నేతలు నెహ్రూ, ఇందిరాగాంధీలు కూడా యోగా చేసేవారని అయితే రాహుల్ కు మాత్రం అలాంటి అలవాటు లేదని.. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల తర్వాత కూడా కోలుకోలేదని రాందేవ్ అంటున్నారు.

 

అందుకే వీలైనంత త్వరగా రాహుల్ గాంధీ యోగా చేయడం మొదలుపెట్టాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. మరి రాహుల్ ఈ సలహాను స్వీకరించి యోగాసనాల ప్రాక్టీస్ మొదలుపెడతారా?  లేదంటే జింలో గడుపుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని యోగా గురు రామ్ దేవ్ బాబా చెప్పారు.

 

ఐదేళ్ల ప్రతిపక్ష వాసం తర్వాత కూడా తమ పార్టీ తీరు ఏ మాత్రం మెరుగు పడకపోవడం గురించి కాంగ్రెస్ పార్టీ  తల పట్టుకుంది! ఈ సారి స్వయంగా రాహుల్ గాంధీ ఎంపీగా ఓడిపోయారు. తమ ప్రధాన మంత్రి అభ్యర్థే ఎంపీగా ఓడిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ.

 

ఐదేళ్ల తర్వాత కూడా పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదు,  కనీసం కొన్ని రాష్ట్రాల్లో అయినా ఘన విజయాలు నమోదు చేయకపోతే వచ్చే ఎన్నికల మీద కూడా ఆశలు  పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కాంగ్రెస్ విషయంలో విశ్లేషణలు సాగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో బాబా రాందేవ్ ఏం చెపుతున్నారంటే "రాహుల్ గాంధీ యోగా చేయకపోవడమే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మరోసారి ఓడిపోయిందని చాల నిక్కచ్చిగా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: