ఈ రోజు జరిగిన సంఘటనపై బారత్ దేశంలో వున్నా ప్రతి ఒక్కని స్పందించే చేసింది . ఇక అస్సలు విషయానికి వస్తే పోలీసులు దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. దీనిపై ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల్ని పలువురు ప్రముఖులు ప్రశంసించగా, తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సైతం దీనిపై స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో ‘ గ్రేట్ వర్క్ హైదరాబాద్ పోలీస్ అంటూ , వి సెల్యూట్ యు’ అని కొనియాడారు.
ఇక హైదరాబాద్ పోలీసుల్ని కేంద్ర మాజీ మంత్రి, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రాజ్యవర్థన్సింగ్ రాథోడ్ కూడా ప్రశంసించారు. అంతేకాదు రాథోడ్ ‘హైదరాబాద్ పోలీసులకు ఇవే నా అభినందనలు. పోలీస్ పవర్ను, నాయకత్వాన్ని చూపెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయం అని దేశ ప్రజలు తెలుసుకోవాలి’ పేర్కొన్నారు.
ఇక ఈ విషయంపై మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన ట్వీటర్ అకౌంట్లో స్పందిస్తూ తెలంగాణ పోలీసుల్ని సూటిగా ప్రశ్నించారు. ‘ భవిష్యత్తులో అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతీ రేపిస్టుకు ఇదే తరహా శిక్ష అమలు చేయాలన్నారు. ఎవరైతే సమాజం పట్ల బాధ్యత లేకుండా హత్యాచార ఘటనలకు పాల్పడతారో వారికి ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇకనైనా అత్యాచార ఘటనలకు ముగింపు దొరుకుతుందా. అత్యాచారానికి పాల్పడిన ప్రతీ ఒక్కర్నీ ఇలానే శిక్షిస్తారా’ ఇదే ‘ముఖ్యమైన ప్రశ్న’ అంటూ జ్వాల చాల గట్టిగానే పోలీసులను ప్రశ్నించారు.
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘటన దిశపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు ఆ నలుగురు నిందితులు పోలీసులుపై దాడి చేశారని, తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని , పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.