ఇండియన్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ గాడ్ ఫాదర్ లాంటివాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతనిది ఎప్పటికీ చెరిగిపోని స్థానం. సచిన్ సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రికార్డులు ఇప్పటికీ కూడా పదిలంగా అనే ఉన్నాయి. అందుకే అభిమానులు ముద్దుగా "మాస్టర్ బ్లాస్టర్" అని పిలుచుకుంటారు. అయితే సచిన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన వారసుని రాక కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబై సీనియర్ జట్టు తరపున అరంగ్రేటం చేశాడు.

స‌య్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హ‌ర్యానాతో జ‌రిగిన మ్యాచ్ లో అర్జున్ ఆడాడు. అంతేకాకుండా మ్యాచ్‌లో అతడు ఓ వికెట్ కూడా తీశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అర్జున్ జూనియర్ టీం తరుపున అండ‌ర్‌-19 మ్యాచ్‌లు ఆడాడు. తాజాగా జరుగుతున్న ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ 20 మంది స‌భ్యులు ఉన్న జ‌ట్టును ఇటీవల ప్ర‌క‌టించింది. దాంట్లో అర్జున్ టెండూల్క‌ర్ పేరు కూడా ఉండటంతో తో అభిమానులు అర్జున్ ఆట కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  21ఏళ్ల అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏజ్ గ్రూప్ టోర్నీల్లోనే ఆడాడు.

తాజాగా ముస్తాక్ అలీ టి20 టోర్నీలో సీనియర్ ఆటగాళ్లతో పాటు అర్జున్ కూడా ఉన్నాడు. ముంబై జ‌ట్టుకు సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. అర్జున్ మొదట 2017లో ముంబై అండర్ -19 జట్టులోకి ప్రవేశించి, ఆ తరువాత సంవత్సరం భారత్ అండర్-19 జట్టులో ఆడాడు. తాజాగా సీనియర్ జట్టులో అర్జున్ టెండూల్కర్ స్థానం సంపాదించుకోవడంతో ఇక  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  పైన కూడా గురిపెట్టిన‌ట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే అర్జున్ టెండూల్కర్ టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఎంతో దూరంలో లేదని తెలుస్తుంది. మరి అర్జున్ క్రికెట్ లో రాణించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: