కేవలం టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు మాత్రమే నిర్వహించేందుకు విరాట్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి... బీసీసీఐకి కోహ్లీ లిఖిత పూర్వకంగా తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే టీ 20 సిరీస్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్నారు. తాజాగా ముగిసిన న్యూజీలాండ్ సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది భారత జట్టు. ఇప్పుడు సౌతాఫ్రికాలో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా రెడీ అయ్యింది. ఈ నెల 26వ తేదీ నుంచి రెండు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఇప్పుడు 20 మంది ప్లేయర్లును పంపేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సిరీస్ నుంచే కెప్టెన్ను మారుస్తారా... లేక.. విరాట్ కోహ్లీని కొనసాగిస్తారా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రస్తుతం టీమ్ సెలక్షన్పై దృష్టి సారించారు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ. ఈ వారంలోనే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. కోహ్లీ కెప్టెన్గా ఉంటారా... లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.
కేవలం టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు మాత్రమే నిర్వహించేందుకు విరాట్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి... బీసీసీఐకి కోహ్లీ లిఖిత పూర్వకంగా తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే టీ 20 సిరీస్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్నారు. తాజాగా ముగిసిన న్యూజీలాండ్ సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది భారత జట్టు. ఇప్పుడు సౌతాఫ్రికాలో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా రెడీ అయ్యింది. ఈ నెల 26వ తేదీ నుంచి రెండు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఇప్పుడు 20 మంది ప్లేయర్లును పంపేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సిరీస్ నుంచే కెప్టెన్ను మారుస్తారా... లేక.. విరాట్ కోహ్లీని కొనసాగిస్తారా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రస్తుతం టీమ్ సెలక్షన్పై దృష్టి సారించారు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ. ఈ వారంలోనే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. కోహ్లీ కెప్టెన్గా ఉంటారా... లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.