ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఇక సరైన ప్రదర్శన చేయలేకపోతున్న హార్దిక్ పాండ్యా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరికి గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత బిసీసీఐ అతని పక్కన పెట్టేసింది. టి20 వరల్డ్ కప్ లో సెలెక్టర్లు అతని జట్టులోకి తీసుకోవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బౌలింగ్ కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాటింగ్ లో అయినా రాణిస్తాడా అనుకుంటే మళ్లీ నిరాశపరిచాడు హార్దిక్ పాండ్యా. దీంతో గత ఏడాది టి20 వరల్డ్ కప్ నుంచి జట్టుకు పూర్తి గా దూరం అయిపోయాడు.
ఇకపోతే ఇటీవలే రంజీ ట్రోఫీ లో కూడా అతను ఆడటం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే రంజీల్లో హార్దిక్ పాండ్యా ఎందుకు ఆడటం లేదు అన్న ప్రశ్నకు ఇటీవల భారత సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఘాటుగానే స్పందించారు. అతను ఎందుకు ఆడటం లేదు మాకు తెలియదు.. మీరు ఏమైనా అడగొచ్చు కదా.. అతడు 100% ఫిట్నెస్ సాధిస్తే అతని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అతడిని సెలెక్ట్ చేయాలో వద్దో మాకు తెలుసు క్లారిటీ ఉంది అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ.