చైనా దేశంలో కరోనా వైరస్ మహమ్మారి చాలా దారుణంగా వ్యాపిస్తుంది. జనాలు చాలా భయంతో తీవ్రంగా వణికి పోతున్నారు. రోజు రోజుకి చైనా దేశంలో కరోనా ఉధృతి బాగా పెరిగిపోతూ కేసులు కూడా చాలా ఎక్కువై పోతున్నాయి. దీంతో ఏం చెయ్యాలో తెలీక అక్కడి ప్రభుత్వం తల పట్టుకొని వుంది. ఇక చైనా దేశంలో కరోనా వైరస్ మహమ్మారి భయాల నేపథ్యంలో ఆసియా క్రీడలు-2022 కూడా వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా శుక్రవారం నాడు వెల్లడించింది.ఇక ఈ మేరకు.. ''ఈ సంవత్సరం సెప్టెంబరు 10 నుంచి 25 వరకు చైనాలోని హాంగ్జౌ నగరంలో నిర్వహించాల్సిన 19వ ఆసియా గేమ్ లను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలిపింపిక్‌ కౌన్సిల్‌ ప్రకటించింది'' అని పేర్కొంది.అలాగే ఇక తదుపరి తేదీలను మరికొన్ని రోజుల్లో వెల్లడించనున్నట్లు తెలిపింది. కాగా ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ కన్ఫమ్ అయిన సంగతి తెలిసిందే. 



అయితే, ప్రస్తుతం చైనాలో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి బాగా విజృంభిస్తున్న నేపథ్యంలో వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఇక చైనాలోని షాంఘై నగరానికి సమీపంలోని హాంగ్జౌలో ఇప్పటికే ఆసియా ఇంకా పారా క్రీడల కోసం 56 వేదికలు నిర్మించినట్లు నిర్వాహకులు గతంలో పేర్కొన్నారు. కాగా కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో షాంఘైలో గత కొద్ది రోజులుగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న సంగతి కూడా తెలిసిందే. ఇక అక్కడ బలవంతంగా కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నారంటూ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్న తరుణంలో పాలకులపై తీవ్ర స్థాయిలో విమర్శలనేవి వెల్లువెత్తుతున్నాయి.చైనాలో ఈ రకమైన కరోనా తీవ్రత కారణంగానే ఆసియా గేమ్స్ వాయిదా పడటం జరిగింది. ఈ రకంగా చాలా దారుణంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చెందుతూ అందరిని భయపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: