టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ ల విధ్వంసానికి మారుపేరు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది బ్యాట్స్మెన్లూ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బౌలర్లపై వీరవిహారం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సిక్సర్లు  ఫోర్లతో చెలరేగిపోతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించడానికి  ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కాసేపు క్రీజులో ఉన్న పర్వాలేదు కానీ పరుగులతో విధ్వంసం సృష్టించాలి అన్న మైండ్ సెట్ తో ఎంతో మంది ఆటగాళ్లు ఉంటారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆటగాళ్లు దూకుడుగా ఆడక తప్పదు.


 ఈ క్రమంలోనే కొన్ని కొన్నిసార్లు కొంతమంది బ్యాట్స్మెన్లూ ఆడే ఇన్నింగ్స్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి. ఒకే ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు సహా ఒక ఫోర్ తో మొత్తంగా 34 పరుగులు  సాధించాడు. అతను ఎవరో కాదు జింబాబ్వే ర్యాన్ బర్ల్ . ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 3 టీ20 సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్లో జింబాబ్వే విజయం సాధించింది.



 రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ పుంజుకుని విజయాన్ని అందుకుంది. అయితే మూడో మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది జింబాబ్వే జట్టు. అయితే జింబాబ్వే విషయంలో అటు బ్యాట్స్మెన్ ర్యాన్ బర్ల్ సెన్సేషనల్ బ్యాటింగ్ కీలక పాత్ర వహించింది అని చెప్పాలి. ఇక ఈ అరుదైన ఇన్నింగ్స్ తో ఒక అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు ఈ బ్యాట్స్మెన్. అంతకు ముందు భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ వీరుడు కిరణ్ పోలార్డ్ సైతం 36 పరుగులు రాబట్టాడు. భారత యువ ఆటగాడు శివం దూబే ఒకే ఓవర్లో 34 పరుగులు రాబట్టాడు.. కాగా తాజాగా ర్యాన్ బర్ల్ 34 పరుగులతో ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: